న్యూఢిల్లీ: భారత వాయు సేన (ఐఏఎఫ్) మాజీ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఆదివారం బీజేపీలో చేరారు. ఆయన ఉత్తరప్రదేశ్కు చెందినవారు. ఐఏఎఫ్ చీఫ్ పదవి నుంచి 2021లో రిటైర్ అయ్యారు.
మళ్లీ బీజేపీ వైపు ‘గాలి’: మైనింగ్ కింగ్గా పేరుగాంచిన గాలి జనార్ధన్ రెడ్డి తాను తిరిగి బీజేపీలో చేరుతున్నట్టు ఆదివారం ప్రకటించారు. గతంలో బీజేపీలో ఉన్న ఆయన సొంతపార్టీ స్థాపించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరే నెగ్గారు.