సిమ్లా:హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్కు రెండవసారి కరోనా సోకింది. శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ) లో చికిత్స కొనసాగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి వెల్లడించారు. వీరభద్ర సింగ్కు ఈ ఏడాది ఏప్రిల్ 13న తొలిసారి కరోనా సోకింది. దీంతో మోహాలీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు. మే నెలలో సిమ్లా వచ్చిన ఆయన అనంతర చికిత్స కోసం ఐజీఎంసీలో చేరారు. గత నెల రోజులుగా ఆసుపత్రిలో ఉంటున్న వీరభద్ర సింగ్తోపాటు ఆయనకు సపర్యలు చేస్తున్న నర్సుకు కూడా కరోనా సోకినట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. వీరభద్ర సింగ్ మార్చిలో కరోనా టీకా తీసుకున్నట్లు పేర్కొన్నారు.