బెళగావి: కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ శన్ముఖప్ప బసప్ప సిడ్నల్ (85) అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం ఉదయం బెళగావిలోని తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సిడ్నల్కు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు, మనుమలు, మనుమరాండ్లు ఉన్నారు.
ఎస్బీ సిడ్నల్ 1980 నుంచి 1991 వరకు బెళగావి నుంచి మొత్తం నాలుగుసార్లు ఎంపీగా పనిచేశారు. కాగా, సిడ్నల్ మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంతాపం తెలియజేశారు. సిడ్నల్ జీవితాంతం నీతి, నిజాయితీలతో బతికిన రాజకీయ నాయకుడని ఆయన కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.