న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత ప్రవీణ్ కుమార్ బుధవారం బీజేపీలో చేరారు. (Former AAP leader joins BJP) ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, బీజేపీ విధానాల నుంచి తాను ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు.
కాగా, గత రెండేళ్లుగా తన నియోజకవర్గంలో తాను ఏ పని చేయలేకపోయినట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ‘ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. తద్వారా మేం వారి కోసం పని చేస్తాం. కానీ మనం వారి వద్దకు వెళ్లలేకపోతే, వారి కోసం పని చేయలేం. అప్పుడు ప్రజలకు మనం పనికిరాం. నేను గత రెండు సంవత్సరాలుగా నా నియోజకవర్గంలో ఏ పని చేయలేకపోయా. అందుకే బీజేపీలో చేరా’ అని అన్నారు.
#WATCH | After joining BJP, former AAP leader Praveen Kumar says, ” I got inspired by the policies of BJP and PM Modi and joined BJP today…people elect us so that we can work for them but if we can’t go to them and do their work, then we are useless to public. Because of this,… pic.twitter.com/DrT2sYLdGB
— ANI (@ANI) September 25, 2024