దోడా: అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణాలు ఆహారం కోసం వెతుక్కుంటూ అప్పుడప్పుడు దారితప్పి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. తాజాగా జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని దోడా పట్టణంలో ఓ చిరుతపులి తీవ్ర గాయాలతో కదలలేని స్థితిలో కనిపించింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను వలలో బంధించారు. అనంతరం దాన్ని బోనులో వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం చిరుతపులి ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.
అయితే, జనావాసాల్లోకి వచ్చిన చిరుతను అంత తీవ్రంగా ఎవరూ గాయపరిచి ఉంటారనే సందేహాలు తలెత్తుతున్నాయి. కానీ, అధికారులు మాత్రం అది ఎవరో మనుషులు చేసిన పనికాదని, రాత్రివేళ కనిపించక ఏదైనా వాహనం ఢీకొట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
Jammu and Kashmir | Forest officials rescued an injured leopard in Doda town
We received information about it from the Sarpanch of Malwas village in Doda. Treatment will be provided to the leopard: Ramesh Kumar, Forest official, Doda pic.twitter.com/O23rS2Le6g
— ANI (@ANI) January 1, 2023