Rajasthan woman | ఆమె అప్పటికే ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. దీంతో బలవంతంగా ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరిపించారు. అయితే బలవంతంగా తనకు తాళి కట్టిన రెండో భర్తకు ఆ మహిళ ఏకంగా రాఖీ (rakhi) కట్టింది. ఈ ఘటన రాజస్థాన్ (Rajasthan)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన తరుణ శర్మ (Taruna Sharma) అనే యువతి తన చిన్ననాటి స్నేహితుడు సురేంద్ర ( Surendra Sankhla)ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. దీంతో పెళ్లైన పదిరోజులకు ఈ జంటను గుర్తించి వేరు చేశారు. అనంతరం యువతిని తమ కులానికి చెందిన ఛత్తీస్ గఢ్ లోని అంతఘర్ పట్టణానికి చెందిన జితేంద్ర జోషి అనే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశాడు. అయితే, ఆ వివాహం యువతికి అస్సలు ఇష్టం లేదు. దీంతో పెళ్లైన వెంటనే రెండో భర్తకు ఆమె రాఖీ కట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి, ఆమెకు ముందే పెళ్లి జరిగిందనే విషయం ఆ వరుడు కుటుంబానికి తెలీదు. తాజా ఘటనతో అసలు విషయం తెలుసుకున్న వరుడు, వధువుకు సపోర్ట్ గా నిలిచాడు. దీంతో ఆ యువతి తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భర్త వద్దకు వెళ్లిపోయింది.
Also Read..
Kazan Khan | చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
Tamanna-Vijay Varma | విజయ్ వర్మతో డేటింగ్.. ఎట్టకేలకు పెదవి విప్పిన మిల్కీ బ్యూటీ
Bengaluru Rains | బెంగళూరును ముంచెత్తిన వర్షం.. నదులను తలపిస్తున్న కాలనీలు