శ్రీనగర్ : ఆర్ఎస్పురా ప్రాంతంలో ఓ మహిళా పాకిస్తాన్కు చెందిన చొరబాటుదారురాలిని ఆర్మీ హతమార్చింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సరిహద్దుల అవతల నుంచి కొందరు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సైనికులు అనుమానాస్పద కదలికలను గమనించి, వారిని హెచ్చరించారు.
పట్టించుకోకుండా భారత భూబాగంలోకి ప్రవేశించగా.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. తప్పించుకుందుకు పరుగులు తీయగా.. కాల్పులు జరుపడంతో బుల్లెట్ తగిలి ఒకరు మరణించారు. అనంతరం అక్కడికి వెళ్లి సోదాలు చేయగా.. చొరబాటుకు పాల్పడింది మహిళగా గుర్తించారు. దీనిపై భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్ఎస్పురా సెక్టార్లో చొరబాటుకు పాల్పడిన మహిళ కాల్పుల్లో మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.
అనుమానాస్పద కదలికలను గుర్తించిన తర్వాత.. బీఎస్ఎఫ్ సిబ్బంది ఇంటర్నేషనల్ బార్డర్ను దాటొద్దని హెచ్చరించినా వినలేదన్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. కొందరు పాక్ ఉగ్రవాదులు లోయలోకి ప్రవేశించారని, వారిని త్వరలోనే అంతమొందిస్తామని డీజీపీ తెలిపారు.