రాయ్పూర్: మొబైల్ ఫోన్ను అతిగా వాడటంపై ఒక బాలికను ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఈ నేపథ్యంలో ఆ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది. జలపాతంలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది (Girl Jumps Into Waterfall). అయితే అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక బాలిక ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లోనే గడుపుతున్నది. దీంతో పేరెంట్స్ ఆమెను మందలించారు.
కాగా, ఆ బాలిక దీనిపై మనస్తాపం చెందింది. దీంతో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయించింది. ఈ నెల 18న సాయంత్రం వేళ ఆ జిల్లాలో ఉన్న చిత్రకోట్ జలపాతం వద్దకు చేరుకున్నది. ఇది చూసి అక్కడున్న వారు వారించారు. జతపాతంలోకి దూకవద్దని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారి మాట వినని ఆ బాలిక జలపాతంలోకి దూకింది. కొంత ఎత్తు నుంచి జలపాతంలోకి దూకిన ఆ బాలిక అదృష్టవశాత్తు ఆ ప్రవాహంలో కొట్టుకుపోలేదు. దీంతో అక్కడున్న వారు ఆమెను కాపాడారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ బాలికను వారికి అప్పగించారు.
మరోవైపు పోలీసులు ఆరా తీయగా మొబైల్ ఫోన్ వాడకంపై తల్లిదండ్రులు మందలించడంతో జలపాతంలోకి దూకి చనిపోయేందుకు ప్రయత్నించినట్లు చెప్పింది. అయితే ఆ బాలిక జలపాతంలోకి దూకడాన్ని అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Girl jumps into Chitrakote Waterfalls in Chhattisgarh after scolded by parents for using mobile.
Spending too much time on the smartphone can have an adverse effect on children's physical and mental health.
Help your children break away from overreliance on smartphones. pic.twitter.com/nMCjRajrb2— Sushree sangita dash (@Sushree_journo) July 19, 2023