Hijacking | విమానం బయలుదేరే సమయంలో ఓ వ్యక్తి హైజాకింగ్ (Hijacking) అని మాట్లాడటం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..
గురువారం రాత్రి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి విస్తారా విమానం (Vistara Plane) బయల్దేరేందుకు రన్ వేపై సిద్ధంగా ఉంది. అంతలోనే విమానంలోని 23 ఏళ్ల రితేష్ సంజయ్ కుమార్ అనే ప్రయాణికుడు హైజాకింగ్ గురించి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడాడు. ఇది విన్న విమాన సిబ్బంది వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 336, 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ ప్రయాణికుడి మానసిక స్థితి సరిగా లేదని, 2021 నుంచి వైద్య చికిత్స పొందుతున్నట్లు విచారణలో తేలింది.
Also Read..
Shehbaz Sharif | మహిళా అధికారిణి చేతిలోని గొడుగు తీసుకెళ్లిపోయిన పాక్ ప్రధాని.. నెట్టింట ట్రోల్స్
Shruti Haasan | మీరు మద్యం తాగుతారా..? నెటిజన్ ప్రశ్నకు శ్రుతిహాసన్ సమాధానం ఏంటంటే
Cobra | ప్లాస్టిక్ డబ్బా మింగేసిన నాగుపాము.. శస్త్రచికిత్స ద్వారా తొలగించిన వైద్యులు