న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల కారణంగా యమునా నది (Yamuna River) ఉప్పొంగింది. వరద ఉధృతితో ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నది. దీంతో యమునా బజార్ను వరద (Yamuna Bazaar) ముంచెత్తింది. ఇండ్లు, కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు రిలీఫ్ క్యాంపులకు వెళ్తున్నారు. హర్యానాలోని హత్నికుండ్ బారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో యమునాలో నీటిమట్టం పెరుగుతున్నది. దీంతో మంగళవారం ఉదయం ఢిల్లీలో 205.68 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. సాయంత్రం 5 గంటల వరకు అది 206.50 మీటర్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నదిలో వరద ప్రవాహం పెరగడంతో లోహా పుల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 5 వరకు ప్రజలతోపాటు వాహనాల రాకలను నిలిపివేస్తున్నామని జిల్లా కలెక్టర్ షాహ్దారా ప్రకటించారు. కాగా, ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాధారణ వర్ష పాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
కాగా, భారీ వర్షం ముంచెత్తడంతో గురుగ్రామ్ నీటమునిగింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. మంగళవారం కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. దీంతో గురుగ్రామ్లో విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
#WATCH | Delhi | Drone visuals from Loha Pul, where the Yamuna River is flowing above the danger level following incessant rainfall since yesterday
Traffic and public movement on Loha Pul to be stopped from 5 pm on 2nd September due to rising water level in the Yamuna River, as… pic.twitter.com/HrLrbbKsj3
— ANI (@ANI) September 2, 2025
#WATCH | Delhi | Visuals from Loha Pul where the Yamuna River is flowing above the danger level following incessant rainfall since yesterday
Traffic and public movement on Loha Pul to be stopped from 1700 hours on 2nd September due to rising water level in the Yamuna river, as… pic.twitter.com/Yk0YOMJR14
— ANI (@ANI) September 2, 2025