న్యూఢిల్లీ: భారత సైన్యంలోని శతఘ్ని(ఆర్టిలరీ) విభాగానికి ఐదుగురు మహిళలు అధికారిణులుగా నియమితులై కొత్త చరిత్ర సృష్టించారు. లెఫ్ట్నెంట్ మెహక్ సైని, సాక్షి దూబే, ఆదితి యాదవ్, పియస్ ముద్గిల్ ఈ ఘనత సాధించారు.
చెన్నైలోని అధికారుల శిక్షణ కేంద్రంలో శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న వీరు దేశ సరిహద్దులో సవాళ్లు విసిరే సమస్యాత్మక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించనున్నారు.