ముంబై, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రంలోని నాసిక్ జిల్లాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మ న్మాడ్-యెవలా హైవేపై అంకాయి దగ్గర ట్ర కు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారు లో ఉన్న ఐదుగురు యువకులు మృతి చెందారు. మృతులంతా నాసిక్లోని గంగాపూర్కు చెందినవారు. వీర ంతా మన్మాడ్ సమీపంలోని మసోభా ఆలయానికి వెళ్లి నాసిక్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.