బెంగళూరు: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, దేశంలో మెల్లగా వ్యాపిస్తున్నది. కర్ణాటకలో గురువారం కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ ఈ విషయాన్ని తెలిపారు. ఐదుగురు ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తులు రెండు డోసుల కోవిషీల్డ్ టీకా తీసుకున్నారని చెప్పారు. దీంతో కర్ణాటకలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరిందని వెల్లడించారు.