Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న 15 మందిలో ఐదుగురు మంటల్లో కాలిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విరుధ్నగర్ జిల్లాలోని శివకాశిలో మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి ఇద్దరు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే.