కాన్పూర్: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ఎలక్ట్రిక్ బస్సు (electric bus) బీభత్సం సృష్టించింది. కాన్పూర్లో అదుపుతప్పిన బస్సు మూడు కార్లు, పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది. పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. చాలా మంది గాయపడ్డారు. బీభత్సం సృష్టించిన బస్సు.. చివరికి ఓ లారీని గుద్ది ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను దవాఖానకు తరలించామని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతనికోసం వెతుకుతున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.