హైదరాబాద్ : తెలంగాణలో మరో నలుగురికి ఒమిక్రాన్ సోకింది. కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు పెరిగింది. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురికి, భారత్కు చెందిన మరో వ్యక్తిలో వేరియంట్ను గుర్తించారు. రిస్ట్ దేశాల నుంచి వచ్చిన ఒకరికి, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్గా తేలింది. మరో ముగ్గురు విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కాగా.. అధికారులు నమూనాలను సేకరించి.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపారు.
అలాగే కర్ణాటకలోనూ ఐదుగురికి పాజిటివ్గా తేలింది. కొత్త కేసులతో మొత్తం సంఖ్య ఎనిమిది పెరిగింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఢిల్లీలో మరో నలుగురికి, గుజరాత్లో ఒకరికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజా కేసులతో కలిపి భారత్లో మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 87కు పెరిగాయి. ఇప్పటి వరకు కర్ణాకటలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్ర 32, రాజస్థాన్ 17, కేరళ 5 , గుజరాత్ 5, ఏపీ, తమిళనాడు, బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది.