గోద్రా: నీట్ యూజీలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు సహకరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ఇప్పటి వరకు గుజారాత్లోని పంచమహ జిల్లా గోద్రా పట్టణంలోని ఓ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. 27 మంది మంది విద్యార్థులతో వీరు రూ.10 లక్షల చొప్పున బేరం మాట్లాడుకొన్నారని తెలిపారు.
గత నెల 5న నిర్వహించిన నీట్ పరీక్షకు ఈ స్కూల్ ఒక సెంటర్గా ఉన్నది. అయితే పరీక్ష క్రమంలో పలువురు అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్కు వచ్చిన సమాచారంతో ఈ రాకెట్కు ఛేదించినట్టు పోలీసులు గత నెల 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసులో అరెస్టు అయిన వారిలో టీచర్ తుషార్ భట్, స్కూల్ ప్రిన్సిపాల్ పర్షోత్తం శర్మ, వడోదరకు చెందిన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ పరుశురాం రాయ్, అతని సహచరుడు విభోర్ ఆనంద్, మధ్యవర్తి ఆరిఫ్ వోహ్రా ఉన్నారు.