ముంబై, నవంబర్ 4: న్యాయమూర్తులను నియమించేందుకు ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ అపారదర్శకంగా ఉన్నదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం వ్యాఖ్యానించారు. జడ్జీలుగా సమర్థవంతమైన వ్యక్తులను నియమించాల్సిన అవసరం ఉన్నదని, కొలీజియంకు తెలిసిన వాళ్లను కాదని అన్నారు. ‘న్యాయవ్యవస్థ సంస్కరణ’ అంశంపై ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.