Zika Virus in UP | ఉత్తరప్రదేశ్లో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. కాన్పూర్ జిల్లాలో ఈ కేసు బయటపడిందని అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత వాయుసేన (ఐఏఎఫ్) అధికారి ఈ జికా వైరస్ బారిన పడ్డారని తెలిపారు.
కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఐఏఎఫ్ అధికారి చికిత్స కోసం కాన్పూర్ జిల్లాలోని వాయుసేన దవాఖానలో చేరారు. ఆయన రక్త నమూనాలను వైద్య పరీక్షల నిమిత్తం పుణెకు పంపారు. దీంతో ఆయనకు జికా వైరస్ సోకిందని నిర్ధారించారు.
సదరు ఐఏఎఫ్ అధికారితో కాంటాక్ట్ అయినట్లు భావిస్తున్న 22 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పుణెకు పంపామని కాన్పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేపాల్ సింగ్ తెలిపారు. గత జూలైలో కేరళలో 24 ఏండ్ల గర్భిణీకి జికా వైరస్ సోకింది. ఆగస్టులో మహారాష్ట్రలో మరో మహిళ ఈ వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
United Nations : చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
Honeytrap : హనీట్రాప్లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
Congress New Rules : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ