కోల్కతా, మార్చి 6: దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ బుధవారం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రారంభించారు. కోల్కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్లో భాగంగా ఈ 4.8 కిలోమీటర్ల ఎస్ప్లనడే-హౌరా మైదాన్ సెక్షన్ను నిర్మించారు. ఇందులో భాగమైన 520 మీటర్ల అండర్ వాటర్ మైట్రో లైన్ హుగ్లీ నది కింద నుంచి వెళ్తుంది. నదీ గర్భ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ ఎస్ప్లనడే నుంచి హౌరా మైదాన్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత అదే రూట్లో తిరిగి ఎస్ప్లనడేకి వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట రాష్ట్ర బీజేపీ నేత సువేందు అధికారి ఉండగా.. రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు. నదీ గర్భ మెట్రో లైన్తోపాటు మోదీ రాష్ట్రంలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు.
అండర్ వాటర్ మెట్రో విశేషాలు