లక్నో: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Ayodhya International Airport) ప్రధాని మోదీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. రన్వేపై ఒక విమానం ల్యాండ్ అయ్యింది. డిసెంబరు 14 న అయోధ్య విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంజూరు చేసింది. దీంతో విమాన కార్యకలాపాలకు ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉంది. ప్రధాని మోదీ డిసెంబర్ 30న అయోధ్య ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తారని, జనవరి 5 నుంచి ఇది వినియోగంలోకి వస్తుందని ఉత్తరప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ గురువారం తెలిపారు. అయోధ్యలో రామ మందిరం తుది దశకు చేరిన నేపథ్యంలో ఇక్కడ నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు.
కాగా, అయోధ్య విమానాశ్రయంలో 2200 మీటర్ల పొడవైన రన్వే, ఏరోనాటికల్ గ్రౌండ్ లైట్స్ (ఏజీఎల్), మౌలిక సదుపాయాలు, డాప్లర్ వెరీ హై-ఫ్రీక్వెన్సీ ఓమ్నీ రేంజ్ (డీవీఓఆర్), ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్) ఉన్నాయి. ఈ విమానాశ్రయం పగలు, రాత్రి కూడా పని చేస్తుంది. 550 మీటర్ల కంటే తక్కువ దృశ్యమాన పరిస్థితులలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), డీజీసీఏ సంయుక్తంగా అయోధ్య ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేశాయి. రద్దీ సమయాల్లో 600 మంది ప్రయాణికులు, ఏటా 10 లక్షల మంది ప్రయాణించేలా టెర్మినల్ భవనాన్ని నిర్మించారు.
#WATCH | Uttar Pradesh: Preparation for the inauguration of Ayodhya International Airport is underway as the rehearsal of an aircraft landing was done on the runway. pic.twitter.com/ZJbXwLIBzO
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 22, 2023