న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ తొలి టెస్ట్ ఫ్లైట్ను ఈ నెల 21న నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శ్రీహరికోటలోని షార్ నుంచి దీన్ని నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ ఫ్లైట్లో భాగంగా వ్యోమగాములు ఉండే ‘క్రూ మాడ్యూల్’ను పరీక్షిస్తారు.
మాడ్యూల్ను అంతరిక్షంలోకి పంపడం, తిరిగి భూమికి తీసుకురావడం, బంగాళాఖాతంలో దిగిన తర్వాత దానిని రికవరీ చేయడాన్ని పరీక్షించనున్నారు.