న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. మొదటి విడుతలో భాగంగా ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 38 స్థానాల్లో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో మహిళలు 15 మంది మాత్రమే ఉండటం గమనార్హం.
తొలివడతో 1,721 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. సీఎం బీరేన్ సింగ్, ఉపముఖ్యమంతి కూడా తొలివిడత బరిలో నిలిచారు. కాగా, మణిపూర్లో తొలివిడుత ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగాల్సి ఉన్నది. అయితే ఎన్నికల ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో నేటికి వాయిదావేశారు. మార్చి 5న మరో 22 స్థానాలకు రెండో విడుత పోలింగ్ జరుగనుంది. అదేనెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాలకు గానూ 28 సీట్లను సొంతం చేసుకున్నా కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 21 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన బీజేపీ అధికారం చేపట్టింది. నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి బీజేపీ, ఎన్పీపీ, ఎన్పీఎఫ్ విడివిడిగా పోటీచేస్తున్నాయి.