ముంబై : భారత్లో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ తొలి కేసు ముంబైలో నమోదైంది. ఈ వేరియంట్ తొలి కేసును ఈ ఏడాది జనవరిలో యూకేలో గుర్తించిన విషయం తెలిసిందే. ముంబైలో 376 నమూనాలను సేకరించి.. జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా.. ఇందులో 230 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ కాగా.. ఒకటి ఎక్స్ఈ వేరియంట్, మరొకటి ‘కప్పా వేరియంట్’కు పాజిటివ్గా వచ్చాయని బీఎంసీ అధికారులు తెలిపారు.
అయితే, కొత్త వేరియంట్ సోకిన రోగికి తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఏం లేవని బీఎంసీ కమిషన్ పేర్కొన్నారు. కొత్త వేరియంట్ హైబ్రిడ్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అనీ, వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. బీఏ.2 సబ్ వేరియంట్ కంటే కొత్త వేరియంట్ పదిశాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. భవిష్యత్లో వేరియంట్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పింది. ఎక్స్ఈ వేరియంట్ రీకాంబినెంట్ (బీఏ.1-బీఏ.2). జనవరి 19న యూకేలో తొలిసారిగా గుర్తించగా.. 600 వరకు కేసులు నమోదయ్యాయి.