న్యూఢిల్లీ : దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సెక్షన్ (Bullet Train) గుజరాత్లోని బిలిమొర-సూరత్ మధ్య 50 కిలోమీటర్ల స్ట్రెచ్ 2026 ఆగస్ట్ నాటికి పూర్తవుతుందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ బుధవారం వెల్లడించారు. దేశ రైల్వే నెట్వర్క్, సేవల ప్రక్షాళనకు భారీ ప్రణాళికలను ఆయన ప్రకటించారు. ట్రాక్లపై రైళ్లు ఢీకొనడంపై అభివృద్ధి చేసిన వార్నింగ్ సిస్టం కవచ్ వ్యవస్ధ గురించి కూడా ఆయన మాట్లాడారు.
ఏనుగులను రైళ్లు ఢీకొనకుండా నిరోధించే గజ్రాజ్ సిస్టం అభివృద్ధిపై కీలక వివరాలు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కోసం ట్రాక్లు నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్లో పనులు ఊపందుకున్నాయని వంద కిలోమీటర్ల పరిధిలో ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లో వయడక్ట్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
ఇందులోనే బిలిమోర-సూరత్ సెక్షన్ అంతర్భాగంగా ఉందని మంత్రి తెలిపారు. వల్సద్, నవ్సారీ, సూరత్, వదోదర, ఆనంద్ జిల్లాల్లో పూర్తయిన వయడక్ట్లను చూపుతూ మంత్రి అశ్వని వైష్ణవ్ ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Read More :
Flipkart Sale | ఫ్లిప్కార్ట్ సేల్లో ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్