కోల్కతా: పశ్చిమబెంగాల్లో తొలి బ్లాక్ఫంగస్ కేసు నమోదయ్యింది. షాంపా చక్రబర్తి అనే 32 ఏండ్ల మహిళ మృతిచెందింది. హరిదేవ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమె కరోనా బారినపడ్డారు. దీంతో శంభునాథ్ పండిట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమెకు బ్లాక్ఫంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరో ఐదుగురు ఈ వ్యాధి బారినపడ్డారని, వారంత ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు.
కళ్లు ఎరుపురంగులోకి మారడం, ముక్కు చుట్టు ఎర్రగా కావడంతోపాటు ఒళ్లు నొప్పులు లేదా జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తం కక్కుకోవడం వంటి లక్షణాలు ఉంటాయని వెల్లడించారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.