Crackers factory: మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లాలోని పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో మృతులు, క్షతగాత్రుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. అగ్నిమాపక సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బలగాలు కాలి కూలిపోయిన శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది క్షతగాత్రులు, మృతదేహాలు బయటపడుతున్నాయి. కొత్త మరో రెండు మృతదేహాలు, 28 మంది క్షతగాత్రులను వెలికి తీశారు.
దాంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. క్షతగాత్రుల సంఖ్య 87కు పెరిగింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ఘటన గురించి జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రతింపులు జరుపుతున్నానని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున మృతులు, క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
#WATCH | Firefighting operation is underway at the firecracker factory in Harda, Madhya Pradesh where a massive explosion took place today.
Six people have died and 59 others are injured in the incident. pic.twitter.com/rbUFx6v6UH
— ANI (@ANI) February 6, 2024