లక్నో: న్యూఢిల్లీ నుంచి బీహర్లోని దర్భంగా వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. (Train on Fire) గమనించిన కొందరు ప్రయాణాకులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి కిందకు దూకారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోని స్లీపర్ కోచ్ నుంచి పొగలు రావడాన్ని సరాయ్ భూపత్ స్టేషన్ మాస్టర్ గమనించారు. వెంటనే లోకోపైలట్ను అలెర్ట్ చేసి రైలును ఆపించారు. ఆ కోచ్లో మంటలు చెలరేగడంతో అందులోని ప్రయాణికులు కిందకు దూకారు.
కాగా, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. కాలిన కంపార్ట్మెంట్లను వేరు చేసిన తర్వాత ఆ రైలు ముందుకు కదిలింది. అయితే మంటలు రాజుకున్న స్లీపర్ కోచ్లో చాలా మంది ప్రయాణికులు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరో రెండు కోచ్లకు ఇవి వ్యాపించినట్లు చెప్పారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Massive fire engulfs three coaches of the New Delhi-Darbhanga Superfast Express in Uttar Pradesh#Etawah #DarbhangaExpress pic.twitter.com/MS1ELuWCMV
— WION (@WIONews) November 15, 2023
Flash:
Latest visuals of a fire broke out on bogies of 02570 New Delhi-Darbhanga Superfast Express train in UP’s #Etawah.
Several passengers jumped out of train as soon as it caught on fire. According to sources, there were more passengers on the train than its capacity.
Fire… pic.twitter.com/UOUVmoTSEa
— Yuvraj Singh Mann (@yuvnique) November 15, 2023