కోల్కతా: తుర్కియే ఎయిర్లైన్స్కు చెందిన ఒక విమానం 236 మంది ప్రయాణికులతో వెళుతూ బుధవారం కోల్కతా ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఇంజిన్లో మంటలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు కెప్టెన్ తెలిపారు. కాఠ్మాండు నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న తుర్కియే 727 విమానం గాల్లో ఉండగా, ఇంజిన్లో మంటలు వచ్చినట్టు పైలట్ గుర్తించాడు. వెంటనే దాన్ని దారిమళ్లించి కోల్కతా విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు.