Fire Accident | ముంబయిలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న క్యాంటీన్లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఎల్టీటీ స్టేషన్లోని ఒకటో నెంబర్ ప్లాట్ఫారమ్లోని జన్ ఆహార్ క్యాంటీన్లో మధ్యాహ్నం 2.45 గంటలకు మంటలు చెలరేగాయని సెంట్రల్ రైల్వే అధికారి పేర్కొన్నారు. అగ్నిప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రమాదంతో ఒక్కసారిగా స్టేషన్లపై పొగలు కమ్ముకున్నాయి. జన్ ఆహార్ క్యాంటీన్లో మంటలు చెలరేగినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివరాజ్ మనస్పురే ధ్రువీకరించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.