సూరత్: గుజరాత్లోని సూరత్లో (Surat) భారీ అగ్నిప్రమాదం జరిగింది. సూరత్లోని పాండెసరా ప్రాంతంలో ఉన్న ఓ టెక్స్టైల్ మిల్లులో శనివారం రాత్రి మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి మిల్లు మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదు.
ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లా ధోలానాలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిపోవడంతో 12 మంది చనిపోయారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 25 మంది కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల పలు ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయి.