ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల బ్రాండ్ శాంసంగ్ సర్వీస్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని కంపెనీ సర్వీస్ సెంటర్లో సోమారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఇక్కడ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ముంబైలోని తూర్పు కంజుమార్గ్లో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 అగ్నిమాపక యంత్రాలు, 4 నీళ్ల ట్యాంకర్ల సాయంతో మంటలను ఆర్పారు.