బోఫాల్: ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనపై సోషల్ మీడియాలో భోజ్పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన పోస్టింగ్పై బోఫాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెల్లని చొక్కా, నల్లని టోపీ, ఖాకీ నిక్కర్ ధరించి.. ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ను పోలి ఉన్న వస్త్రధారణలో అర్ధ నగ్నంగా ఉన్న నిందితుడు ప్రవీశ్ శుక్లా గిరిజనుడిపై మూత్రం పోస్తున్నట్టు ఆ పోస్ట్లో కనిపిస్తున్నది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
యూపీలో ప్రభుత్వ చర్యల వల్ల మరణించిన తల్లీకూతుళ్లపై ఆమె పాడిన పాటపైనా కేసు నమోదైంది. ప్రభుత్వం తన ప్రశ్నలకు బదులివ్వదని, నోటీసులే జారీ చేస్తుందని ఆమె తెలిపారు.