న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో తొమ్మిదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ చరిత్రలో తొలిసారి బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెడుతున్నారు. అమెరికా టారిఫ్ల ప్రభావం నేపథ్యంలో దేశ ఆర్థిక గతిని సక్రమ దారిలో నిలిపేందుకు కేంద్ర మంత్రి నిర్మల దానికి తగినట్లు బడ్జెట్ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లోటును తగ్గించేందుకు, సంస్కరణలు కొనసాగించేందుకు చర్యలు చేపట్టనున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ రూపొందించిన 2025-26 ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2025-26 ఆర్థిక సంవత్సర రిపోర్టు ప్రకారం దేశంలో 7.4 శాతం వృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి.
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman, along with her team, with the Budget tablet outside the Ministry of Finance.
She will present the #UnionBudget2026 today at around 11 AM in Lok Sabha. pic.twitter.com/x5oPMFlWbD
— ANI (@ANI) February 1, 2026