న్యూఢిల్లీ: 20,000 మంది పశువైద్య నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు రుణంతో ముడిపడిన పెట్టుబడి సబ్సిడీ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రతిపాదించారు. ప్రైవేట్ రంగంలో పశువైద్య కళాశాలలు, పశువైద్య దవాఖానలు, డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలు, పెంపకం కేంద్రాల ఏర్పాటుకు ఈ పథకం మద్దతు ఇస్తుంది.
పశు సంవర్ధక పరిశ్రమల అభివృద్ధి కోసం రుణంతో ముడిపడిన సబ్సిడీ కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.