న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి చిన్న షాక్ తగిలింది! వేరే కారణం వల్ల కలిగిన కోపంతో బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశానని మైనర్ రెజ్లర్ తండ్రి గురువారం మీడియాకు వెల్లడించాడు. ‘కోర్టులో నిజం వెల్లడి కావడం కంటే ఇప్పుడు బయటకు రావడమే మేలు’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. 2022లో అండర్-17 చాంపియన్షిప్ ట్రయల్స్ ఫైనల్స్లో తన కూతురు ఓడిపోయిందని, నిబంధనలు పాటించలేదని తెలిపారు.
ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్ డిప్యూటేషన్ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేశానని వెల్లడించారు. ఇతరులకు(మీకు) అది ఒక్క పోటీనే(బౌట్) కావచ్చని, కానీ అది తన కూతురు ఏడాది శ్రమకు ఫలితమని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. గత ఆరు నెలలుగా పోరాటం చేస్తున్న రెజ్లర్ల వల్ల తాను గానీ, తన కూతురు గానీ ప్రభావితం కాలేదని ఆయన స్పష్టం చేశారు. మీ ఆరోపణలు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారని ఆయనను మీడియా మరోసారి ప్రశ్నించగా.. ‘నా కూతురు ఓడిపోయిన అండర్-17 చాంపియన్షిప్ ట్రయల్స్పై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని అధికారులు నాకు హమీ ఇచ్చారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.