శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా ఇవాళ హాస్పిటల్లో చేరారు. ఆయనకు కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. నిరంతర వైద్యుల పర్యవేక్షణ నిమిత్తం ఫారూక్ అబ్దుల్లాను హాస్పిటల్ చేర్చినట్లు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఓ ట్వీట్లో తెలిపారు. శ్రీనగర్లో ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఆయన్ను చేర్చారు. ఫారూక్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నవారికి, మద్దతు ఇస్తున్నవారికి ఒమర్ థ్యాంక్స్ తెలిపారు. గడిచిన వారం ఫారూక్ కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలారు. నిన్నటి వరకు ఆయన ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నారు.