farmers protest | ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి (farmers protest). ఢిల్లీ చలో నిరసనను రెండు రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రైతు నేతలు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం నిర్ణయం వెలువరిస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.
తమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేలా చట్టబద్ధత చేయడంతో పాటు.. రుణమాఫీ, పలు డిమాండ్లతో రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్ (Dilli Chalo March)ను బుధవారం ఉదయం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిపిన నాలుగో దఫా చర్చల్లో కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించిన రైతులు.. బుధవారం ఉదయం తిరిగి పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో పంజాబ్ – హర్యానా సరిహద్దులో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఒక యువ రైతు మరణించాడు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ చలో మార్చ్ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు రైతు నేతలు ప్రకటించారు.
ఢిల్లీ చలో మార్చ్ను రెండు రోజులు వాయిదా వేస్తున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణపై ఫిబ్రవరి 23 శుక్రవారం సాయంత్రం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని తెలిపారు. ఖనౌరీ-శంభు సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హర్యానా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Also Read..
Anganwadi | జీతాలూ మహాప్రభో.. రెండు నెలలుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అందని వేతనాలు
Hyderabad | హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు.. పరారీలో డాక్టర్
Telangana | అన్నదాతకు ‘వరి’గోస.. ఐదారేండ్ల తర్వాత మళ్లీ ఎండుతున్న పంటలు