న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించాలని ఎస్కేఎం తాజాగా పిలుపునిచ్చింది. అంతకు ముందు రైతాంగ సమస్యలపై మహాపంచాయత్లు నిర్వహించాలని కోరింది. ఫిబ్రవరి 26న రైతులంతా పాదయాత్రగా ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. కనీస మద్దతు ధర ఇవ్వాలని, రుణాలు రద్దు చేయాలని, విద్యుత్ రంగం ప్రైవేటీకరణను ఉపసంహరించాలని, 60 ఏండ్లు దాటిన రైతులకు పింఛన్ ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు.