మాల్డా, జనవరి 18: భారత్, బంగ్లాదేశ్కు చెందిన రైతుల మధ్య తలెత్తిన వాగ్వాదం చిన్నపాటి ఘర్షణకు దారి తీయడంతో శనివారం సరిహద్దు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అయితే బీఎస్ఎఫ్, బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ) వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 6న ఉభయ దేశాలకు చెందిన సరిహద్దు భద్రతా దళాల మధ్య వివాదం తలెత్తిన సుఖ్దేవ్పూర్ సరిహద్దు ఔట్పోస్టు ప్రాంతం వద్దనే శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.