పనాజీ: బీజేపీ పాలిత గోవాలో చెరకు రైతుల ఆందోళనలపై రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజధాని పనాజీలో ఆందోళనలు చేయడం ద్వారా వారు ‘షో’ చేస్తున్నారంటూ నోరుపారేసుకొన్నారు. మూడేండ్లుగా చెరకు పండించకుండానే ఇంట్లో కూర్చొంటున్న రైతులకు పరిహారం రూపంలో పెద్దమొత్తంలో డబ్బు అందుతున్నదంటూ రైతులను అవమానించేలా మాట్లాడారు. పనాజీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్బందోరాలోని చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని రైతులు ఆందోళన చేపడుతున్నారు.