చండీఘఢ్ : పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన వృద్ధ రైతును అదృష్టం వరించింది. మహిల్పూర్ నగరంలో నివసించే శీతల్ సింగ్ కుటుంబసభ్యుని కోసం మందులు కొనుగోలు చేసేందుకు మెడికల్ స్టోర్కు వెళ్లాడు. ఆపై లాటరీ టికెట్ కూడా కొనుగోలు చేశాడు.
కొన్ని గంటల తర్వాత మీరు రెండున్నర కోట్లు గెలుచుకున్నారని లాటరీ నిర్వాహకుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. జాక్పాట్ తగలడంతో సంతోషంలో మునిగితేలిన సింగ్ లాటరీ మొత్తంతో ఏం చేయాలనేది కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.
రైతుగా వ్యవసాయ పనులు చేసుకునే సింగ్ ఇద్దరు పిల్లలకూ పెండ్లిండ్లయ్యాయి. కాగా, తాను 15 ఏండ్ల నుంచి లాటరీ టికెట్లు విక్రయిస్తున్నానని, కోట్లాది రూపాయల ప్రైజ్ మనీని గెలుపొందిన సింగ్ తన మూడవ కస్టమర్ అని లాటరీ స్టాల్ యజమాని తెలిపాడు.
Read More :
Rave Party: రేవ్ పార్టీలో సీజ్ చేసిన పాములను అడవిలో వదిలేశారు.. వీడియో