చెన్నై: హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బెసాంట్ నగర్ విద్యుత్ శ్మశాన వాటికలో ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి.
స్వామినాథన్ పార్థివ దేహం శ్మశాన వాటికకు చేరుకున్న తర్వాత పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. అనంతరం శంఖం పూరించారు. ఆ తర్వాత పార్థివ దేహాన్ని విద్యుత్ చితిలోకి పంపి దహనం చేశారు. కాగా, 98 ఏళ్ల స్వామినాథన్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో గురువారం మరణించారు.