Farm Laws | ఏడాది కాలంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన విజయవంతమైంది. నిరంతరాయంగా, పట్టుదలగా కర్షకులు ఆందోళన కొనసాగిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ దిగిరాక తప్పలేదు. శుక్రవారం గురునానక్ జయంతి సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ గతేడాది ఆమోదించిన మూడు చట్టాలను తక్షణం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ గతేడాది నుంచి ఇప్పటి వరకు ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఈకేసుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసుల్లో చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), తదితర కీలక కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసు అధికారులు మాత్రం కేసులు యధాతథంగా కొనసాగుతాయంటున్నారు. విధ్వంసం, నిబంధనల ఉల్లంఘన నిబంధనల కింద కేసులు నమోదయ్యాయి. ఇక ఉపా కేసులు, ఇతర కేసుల విచారణ కొనసాగుతుందని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. ఒకవేళ ప్రభుత్వాలు అనుమతిస్తే సంబంధిత కేసులనూ న్యాయస్థానాల్లో క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
2020 సెప్టెంబర్ ఉంచి డిసెంబర్ వరకు దేశ రాజధాని ఢిల్లీలో 39 కేసులు, ఒక ఆత్మహత్య కేసు నమోదైందని హోంశాఖ ప్రకటించింది. హర్యానా సర్కార్ 136 కేసులు నమోదు చేశామన్నది. అంతేకాక 10 వేల మంది గుర్తు తెలియని రైతులపై కేసులు నమోదయ్యాయ. సోనెపట్లో 26, అంబాలాలో 15, కురుక్షేత్రలో 14 కేసులు ఉన్నాయి. 2,500 మందికి పైగా రైతులపై ప్రభుత్వాలు కేసులు పెట్టాయని సంయుక్త్ కిసాన్ మోర్చా ఆరోపించింది. యమునానగర్, అంబాలా, కర్నాల్, సిర్సా, కురుక్షేత్రలలో ఎక్కువ మందిపై కేసులుపెట్టారని బీకేఎం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
బ్రదర్.. ఐ లవ్ యూ.. రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్కు కోహ్లీ సందేశం
Work from office : యాపిల్ ఉద్యోగులకు తాజా డెడ్లైన్ ఇదే!
Pension for Sr Citizens | రూ.15 లక్షల మదుపుతో నెలకు రూ.10 వేల పెన్షన్.. ఎలాగంటే?!
చంద్రబాబు ఏడుపుతో నేను చాలా హ్యాపీ.. రోజా సంచలన వ్యాఖ్యలు