న్యూఢిల్లీ : అయోధ్యలోని రామజన్మభూమి స్థలం చరిత్రపై విమర్శలు వస్తున్నందువల్ల భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) నివేదికను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ బీఆర్ మణి కోరారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బాబ్రీ మసీదు కింద ఉన్న శిథిలాలు 12వ శతాబ్దానికి చెందినవని తెలిపారు.
హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలు సాక్ష్యాధారాలుగా కనిపించాయన్నారు. ఈ నివేదికను బయటపెడితే విమర్శకుల నోళ్లు మూతపడతాయని మణి ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. కోర్టు ఆదేశాల కారణంగా తాను 16సంవత్సరాలపాటు దీని గురించి మాట్లాడలేదని చెప్పారు.