బెంగళూరు: ఒక కుటుంబం అసెంబ్లీ బయట ఆత్మహత్యకు ప్రయత్నించింది. (Family Tries To End Life) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఒక కుటుంబం 2016లో బెంగళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఇంటిపై రూ. 50 లక్షలు రుణం తీసుకుంది. సుమారు రూ.95 లక్షలు తిరిగి చెల్లించారు. అయితే వడ్డీ, ఇతర బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించకపోవడంతో వారి ఇంటిని బ్యాంకు వేలం వేసింది.
కాగా, ఈ సంఘటనపై ఆ కుటుంబం మనస్తాపం చెందింది. బుధవారం పిల్లలతో సహా ఎనిమిది మంది కుటుంబ సభ్యులు కర్ణాటక అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. బ్యాంకు తమ ఇంటిని వేలం వేసిందంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. నిప్పంటించుకుని సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించారు.
మరోవైపు దీనిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. కుటుంబం ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు.