న్యూఢిల్లీ: నకిలీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇన్స్పెక్టర్లుగా అవతారమెత్తిన కొందరు వ్యక్తులు ఒక వ్యాపారవేత్తను బెదిరించి బంధించారు. (Fake DRI Inspectors ) అసహజ శృంగారానికి పాల్పడటంతోపాటు అతడి నుంచి లక్షలు దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి కొరియర్ బిజినెస్ చేస్తున్నాడు. ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి అతడికి ఫోన్ వచ్చింది. డీఆర్ఐలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న తుషార్ సక్సేనాగా పరిచయం చేసుకున్నాడు. వ్యాపార భాగస్వామిగా ఉండి విడిపోయిన ప్రశాంత్తో సెటిల్ చేసుకోవాలని, రూ.50,000 చెల్లించాలని డిమాండ్ చేశాడు.
కాగా, ఫిబ్రవరి 18న ఆ వ్యాపారికి తుషార్ మరోసారి ఫోన్ చేశాడు. ప్రశాంత్తో కలిసి ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర తనను కలవాలని చెప్పాడు. అలాగే రూ.20,000 డిమాండ్ చేశాడు. రైల్వే స్టేషన్ వద్ద తుషార్తోపాటు బాబూరావు, అభిజీత్ ఉన్నారు. వారిద్దరూ కూడా డీఆర్ఐ అధికారులమని పేర్కొంటూ నకిలీ గుర్తింపు పత్రాలు చూపించారు.
మరోవైపు ఆ వ్యాపారి నుంచి డబ్బు తీసుకున్న తర్వాత కారులో కూర్చోవాలని అతడ్ని బలవంతం చేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లారు. పహడ్గంజ్లోని హోటల్లో ఆ వ్యాపారిని బంధించారు. కొట్టడంతోపాటు అతడితో అసహ శృంగారంలో పాల్గొన్నారు. దీనిని రికార్డ్ చేసి బెదిరించి రూ.2.3 లక్షలు వసూలు చేశారు. ఫిబ్రవరి 24న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద అతడ్ని వదిలేశారు.
కాగా, బాధిత వ్యక్తి జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులైన తుషార్, అభిజీత్, ప్రశాంత్, బాబూరావును అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించగా డీఆర్ఐ గురించి ఎవరికీ పెద్దగా తెలియదని, అందుకే ఆ సంస్థ పేరుతో నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు.