ఇంఫాల్, అక్టోబర్ 26: రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని పునరుద్ధరిస్తామన్న మణిపూర్ సీఎం ఎన్ బీరేన్సింగ్ చెప్పిన మాటలు అమల్లోకి రాలేదు. మొబైల్ ఇంటర్నెట్ను అక్టోబర్ 31వరకు పొడగిస్తూ బీరేన్సింగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే ఫొటోలు, వీడియోలతో సంఘ విద్రోహ శక్తులు శాంతిభద్రతలను దెబ్బతీసే అవకాశముందన్న భయంతో బ్యాన్ను పొడగిస్తున్నాం’ అని రాష్ట్ర హోం శాఖ కమిషనర్ తాజాగా నోటిఫికేషన్ జారీచేశారు.