లక్నో : ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. సర్సావా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్పూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
పలువురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు. సర్సావా పోలీస్ స్టేషన్ పరిధిలోని సొరానా ఫారెస్ట్లో లైసెన్స్ పొందిన బాణాసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు.