చెన్నై: క్రాకర్స్ గోడౌన్లో పేలుడు (Explosion) సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు మహిళలు మరణించారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నాగరసంపట్టి సమీపంలోని ప్రైవేట్ క్రాకర్స్ తయారీ పరిశ్రమకు చెందిన గోడౌన్లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. అయితే పేలుడు వల్ల పటాసుల గోడౌన్ పూర్తిగా ధ్వంసమైంది. టపాకుల పేలుళ్లకు స్థానికులు భయాందోళన చెందారు. పెద్ద సంఖ్యలో సంఘటనా ప్రాంతానికి తరలి వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, క్రాకర్స్ గోడౌన్లో పేలుడు ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. పేలుడు ఘటనలో మరణించిన ఇద్దరు మహిళల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున, గాయపడిన వ్యక్తికి లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు.
Also Read: